News November 19, 2025

విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

image

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్‌లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.

Similar News

News March 7, 2026

విశాఖ: పట్టువదలని ప్రయత్నం.. సివిల్స్‌లో ర్యాంక్

image

విశాఖకి చెందిన శ్వేత గుమ్మల సివిల్ సర్వీసెస్ పరీక్షలో 573వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. ఆమె తండ్రి రాజాబాబు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. శ్వేత విశాఖలో పాఠశాల విద్య, జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తరువాత IIT హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసింది. కృషి, పట్టుదలతో సివిల్స్‌లో ర్యాంక్ సాధించి కుటుంబానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

News March 7, 2026

సివిల్స్‌లో కర్నూలు యువకుడికి 297వ ర్యాంకు

image

కర్నూలుకు చెందిన పవనకుమార్ రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 297వ ర్యాంకు సాధించారు. గతేడాది 375వ ర్యాంకుతో IRSకు ఎంపికైన ఆయన, IAS సాధనే లక్ష్యంగా ఢిల్లీలో శిక్షణ పొందారు. నిన్న విడుదలైన ఫలితాల్లో 297 ర్యాంకుతో సత్తా చాటారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని పవన్ తెలిపారు. తన ర్యాంకుకు ఐఏఎస్ వస్తే వెళ్తానని, లేదంటే మరోసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

News March 7, 2026

విజయవాడ: తండ్రి సీఐ.. కుమార్తెకు సివిల్స్‌లో 520 ర్యాంక్

image

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ఫలితాలను శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అహోరాత్రులు శ్రమించిన అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. విజయవాడకు చెందిన సీఐ సుధాకర్ కుమార్తె హర్షిత 520వ సాధించి సత్తాచాటారు. తాను 2022 సంవత్సరం నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు హర్షిత తెలిపారు. ఈ మేరకు ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.