News November 19, 2025
ఉమ్మడి కరీంనగర్లో BCలకు 268 GPలే..!

50% రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధనతో బీసీలకు 22 శాతం రిజర్వేషన్ల క్యాప్తో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,216 గ్రామపంచాయతీల(GP)లో 22% రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు మొత్తంగా 268 స్థానాలు మాత్రమే దక్కనున్నాయి. ఇక రిజర్వేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News March 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

♦ డయేరియా ఘటనపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న
♦పాతపట్నం సమస్యలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే గోవింద్
♦ టెక్కలి: భూములు ఇవ్వమంటూ రైతుల నిరసన
♦ జిల్లాలో దివ్యంగ శక్తి పథకం ప్రారంభం
♦శ్రీకాకుళం: మామిడి కాయలు కొరత
♦ నరసన్నపేట: జూనియర్ క్రీడా మైదానంలో నాగుపాము సంచారం
♦ టెక్కలి: రెండు నెలలలో ఇద్దరు కిడ్నీ రోగులు మృతి
News March 18, 2026
చీరాల 1 టౌన్ ఎస్ఐ భాస్కరరావు మృతి

చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న వల్లాగి భాస్కరరావు బుధవారం మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆయనకు ఇంటి వద్ద హార్ట్ఎటాక్ వచ్చింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డీఎస్పీ మొయిన్, సీఐలు సుబ్బారావు, అశోక్ కుమార్, మల్లికార్జునతో పాటు పోలీసులు నివాళులు అర్పించారు. ఆయన 42 ఏళ్ల నుంచి పోలీస్ విభాగంలో సేవలందించారన్నారు.
News March 18, 2026
రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి ఉత్తమ్

రాష్ట్ర ప్రజలకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఆశలు, లక్ష్యాలతో ప్రజలంతా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రైతాంగానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.


