News November 18, 2025
కర్నూలు: 595 మందికి షోకాజ్ నోటీసులు

‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్’ల పంపిణీకి సంబంధించి విద్యార్థుల నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ చర్యలు తీసుకున్నారు. 26 మంది మండల విద్యాశాఖ అధికారులు, 569 మంది ప్రధానోపాధ్యాయులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో సరైన వివరణ ఇవ్వకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News November 18, 2025
NTJ-5 పొట్టి జొన్న రకంతో అధిక దిగుబడి

నంద్యాల పరిశోధనా స్థానం నుంచి NTJ-5 జొన్న రకం విడుదలైంది. ఇది అధిక దిగుబడినిచ్చే పొట్టి జొన్న రకం. దీని పంటకాలం 100 నుంచి 105 రోజులు. వర్షాభావ పరిస్థితులకు ఇది అనుకూలం. ఈ సజ్జ గింజలు పసుపు-తెల్ల రంగులో ఉంటాయి. కరువు ప్రాంతాల్లో సాగుకు ఇది అనుకూలం. NTJ-5 రకం దిగుబడి హెక్టారుకు 48 నుంచి 50 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఈ రకం మొక్క 150-180 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుంది. కిందకు పడిపోదు.
News November 18, 2025
NTJ-5 పొట్టి జొన్న రకంతో అధిక దిగుబడి

నంద్యాల పరిశోధనా స్థానం నుంచి NTJ-5 జొన్న రకం విడుదలైంది. ఇది అధిక దిగుబడినిచ్చే పొట్టి జొన్న రకం. దీని పంటకాలం 100 నుంచి 105 రోజులు. వర్షాభావ పరిస్థితులకు ఇది అనుకూలం. ఈ సజ్జ గింజలు పసుపు-తెల్ల రంగులో ఉంటాయి. కరువు ప్రాంతాల్లో సాగుకు ఇది అనుకూలం. NTJ-5 రకం దిగుబడి హెక్టారుకు 48 నుంచి 50 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఈ రకం మొక్క 150-180 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుంది. కిందకు పడిపోదు.
News November 18, 2025
దడ పుట్టిస్తున్న వానరాలు.. వేములవాడలో కోతులతో పరేషాన్

వేములవాడ ఆలయంలో కోతులు హల్చల్ చేస్తున్నాయి. పట్టణంలో కొంతకాలంగా కోతుల సంచారం ఎక్కువైంది. ముఖ్యంగా భక్తుల సంచారం అధికంగా ఉండే ఆలయ పరిసరాల్లో వానరాలు అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. ఆలయ ముఖ్య బుకింగ్ కౌంటర్ క్యూలైన్లో కోతులు వాటికి కావాల్సిన ఆహారం కోసం అటుఇటు తిరుగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో కోతులు వస్తుండడంతో క్యూలైన్లలోని భక్తులు భయపడుతున్నారు.


