News November 19, 2025
అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.7వేలు

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.5వేలు.. మొత్తంగా రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
Similar News
News March 24, 2026
మన దగ్గర ఎన్నిరోజులకు సరిపడా ఇంధనం ఉందంటే..

దేశంలో దిగుమతులకు అంతరాయం ఏర్పడితే మన క్రూడాయిల్ రిజర్వులు(100% కెపాసిటీ) 9.5 రోజులకే సరిపోతాయని కేంద్రం వెల్లడించింది. వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వు(SPR)ల్లో 33.72 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ నిల్వ ఉందని తెలిపింది. APలోని విశాఖ, KAలోని మంగళూరు, పాదూర్లో ఈ రిజర్వులు ఉన్నట్లు వివరించింది. వీటి మొత్తం కెపాసిటీ 53.3L MT అని పేర్కొంది. RTI ద్వారా India Today అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.
News March 24, 2026
యుద్ధం.. బీర్లు తాగేవారికి షాక్!

దేశంలో బీర్ల ధరలు పెరుగుతాయని, సరఫరాకు కొరత ఏర్పడొచ్చని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(BAI) తెలిపింది. ‘యుద్ధం వల్ల తయారీ ఖర్చు 12-15% పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ధరలు ఉన్నాయి’ అని పేర్కొంది. సీసాల ధరలు 20%, మెటీరియల్స్ రేట్లు 20-25%, రవాణా ఖర్చులు 10% పెరిగాయి. BAIలోని యునైటెడ్ బ్రూవరీస్, కార్ల్స్బర్గ్, AB InBev తదితర కంపెనీలు దేశంలో 85% బీర్లు అమ్ముతున్నాయి.
News March 24, 2026
సినీ పరిశ్రమ అభివృద్ధిపై CM CBNతో సంజయ్ దత్ భేటీ

AP: CM CBNతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, షూటింగ్లకు APని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై చర్చ జరిగింది. సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంజయ్ దత్ వివరించారు. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని CM తెలిపారు.


