News November 18, 2025
AP న్యూస్ రౌండప్

* ఒడిశాలో జరిగిన ఏకలవ్య మోడల్ స్కూల్స్ నేషనల్ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన గిరిజన విద్యార్థులు 32 బంగారు, 42 వెండి, 40 కాంస్య పతకాలు సాధించారు.
* రాజమండ్రిలో రూ.100 కోట్లతో పైలట్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జార్విస్ ఏవియేషన్ సంస్థ వెల్లడించింది.
* ఇస్రో, TIFR, అణుశక్తి విభాగాల ఆధ్వర్యంలో డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో సైంటిఫిక్ బెలూన్ ప్రయోగాలు జరగనున్నాయి.
Similar News
News November 18, 2025
మీ భాగస్వామి ఇలా ఉన్నారా?

మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. వీరిలో కొందరు భాగస్వామిని మానసికంగా వేధిస్తుంటారంటున్నారు నిపుణులు. తమను తామే గొప్పగా ఊహించుకుంటూ.. నేనే కరెక్ట్, నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారు. భాగస్వామి నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచోళ్లు ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టించి వారిపై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.
News November 18, 2025
మీ భాగస్వామి ఇలా ఉన్నారా?

మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. వీరిలో కొందరు భాగస్వామిని మానసికంగా వేధిస్తుంటారంటున్నారు నిపుణులు. తమను తామే గొప్పగా ఊహించుకుంటూ.. నేనే కరెక్ట్, నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారు. భాగస్వామి నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచోళ్లు ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టించి వారిపై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.
News November 18, 2025
ప్రభుత్వంపై విమర్శలు.. 65 ఏళ్ల మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష

వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై అక్కడి కోర్టు ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా వాట్సాప్ ఆడియో మెసేజ్లో నికోలస్ను విమర్శించిన మార్గీ ఒరోజ్కో అనే 65 ఏళ్ల వైద్యురాలికి ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెపై రాజద్రోహం, ద్వేషాన్ని ప్రేరేపించారనే నిందలు మోపింది. కాగా ప్రస్తుతం వెనిజులాలో 882 మంది రాజకీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ NGO వెల్లడించింది.


