News November 18, 2025

HYD: మిద్దె తోటలతో ఎన్నో ప్రయోజనాలు

image

HYDలో మిద్దె తోటల పెంపకం జోరందుకుంది. ఈ పద్ధతితో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని నేచురల్ ఫుడ్ తీసుకోవచ్చు. మరోవైపు భవన ఉష్ణోగ్రతలు తగ్గతుందని పేర్కొన్నారు. నీటి ఉపయోగం పెద్దగా లేకుండా ఈజీగా ఫ్రెష్‌గా వండుకోవచ్చని డా.విష్ణు వందన తెలిపారు. ఉద్యానశాఖ నెలలో రెండో శనివారంలో ఒక్కోచోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గోవిందారంలో 8.6℃ల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కథలాపూర్ 9.4, మన్నెగూడెం 9.7, తిరుమలాపూర్ 9.8, గొల్లపల్లి 9.9, మల్లాపూర్, పూడూర్ 10, జగ్గసాగర్, పెగడపల్లె 10.2, అయిలాపూర్ 10.3, రాఘవపేట 10.4, మేడిపల్లె, మల్యాల్, మద్దుట్ల, నేరెళ్ల 10.6, పొలస 10.7, అల్లీపూర్, కొల్వాయి 10.8, కోరుట్లలో 10.9℃గా నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది.

News November 18, 2025

జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గోవిందారంలో 8.6℃ల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కథలాపూర్ 9.4, మన్నెగూడెం 9.7, తిరుమలాపూర్ 9.8, గొల్లపల్లి 9.9, మల్లాపూర్, పూడూర్ 10, జగ్గసాగర్, పెగడపల్లె 10.2, అయిలాపూర్ 10.3, రాఘవపేట 10.4, మేడిపల్లె, మల్యాల్, మద్దుట్ల, నేరెళ్ల 10.6, పొలస 10.7, అల్లీపూర్, కొల్వాయి 10.8, కోరుట్లలో 10.9℃గా నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది.

News November 18, 2025

మంచిర్యాలలో అమానవీయ ఘటన

image

మంచిర్యాలలో అమానవీయ ఘటన జరిగింది. సాయి హనుమాన్ నగర్‌కు చెందిన వృద్ధురాలు నాడెం రాజు ఆదివారం రాత్రి మృతి చెందింది. కుమార్తె లలిత పాత ఇంటిలో వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహాన్ని పాత మంచిర్యాలలోని ఇంటికి తరలించింది. ఈ విషయం సీఐ ప్రమోద్ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన జోక్యంతో మృతదేహాన్ని వెనక్కి తెచ్చారు. తల్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై పంచుకునేందుకు అంగీకారం కుదరడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.