News November 19, 2025
HYD: వరుసగా ముహుర్తాలు.. మాల్స్ ఫుల్

ఈ నెలలో వచ్చే వారంలో భారీగా ముహూర్తాలు ఉండడంతో బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, కొంపల్లి, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్ నిండుగా కనిపిస్తున్నాయి. మాల్స్ వద్ద వస్త్రాల కొనుగోలు జరుగుతుండగా, బంగారు దుకాణాల్లో సైతం జనం పెరుగుతున్నారు. 3 రోజులుగా డిమాండ్ మరింత పెరిగిందని షాపుల యజమానులు చెబుతున్నారు.
Similar News
News March 14, 2026
ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ పాసుల ధర పెంపు

ఫాస్టాగ్ వార్షిక పాసుల ధరలను పెంచుతున్నట్లు NHAI ప్రకటించింది. ప్రస్తుతం రూ.3వేలు ఉండగా ఏప్రిల్ 1 నుంచి రూ.3,075 వసూలు చేయనున్నట్లు తెలిపింది. కార్లు, జీపులు, వ్యాన్ల లాంటి ప్రైవేట్ నాన్ కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది. ఏడాది కాలం లేదా 200 ట్రిప్పులకు (ఏది ముందుగా వస్తే అది) ఈ వార్షిక పాస్ వినియోగించుకోవచ్చు.
News March 14, 2026
భూపాలపల్లి MLA పీఏ అరెస్టు

భూపాలపల్లి MLA గండ్ర సత్యనారాయణ రావు పీఏ శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. చిట్యాల మండలానికి చెందిన దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని కాదని, ఓ మహిళా SIని వివాహం చేసుకునేందుకు శ్రీనివాస్ సిద్ధమయ్యాడని పేర్కొంది. ఈ మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
News March 14, 2026
ASF: గుండెపోటుతో వార్డు మెంబర్ మృతి

కౌటాల మండలంలోని మొగడ్ దగడ్ గ్రామపంచాయతీ 4వ వార్డు సభ్యురాలు తారాబాయి(50) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబీకుల కథనం ప్రకారం.. ఉదయం ఇంట్లో పని చేస్తుండగా ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రజా ప్రతినిధి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


