News November 19, 2025
ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి: KMR SP

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాక్-అప్ రూమ్ సహా అన్ని విభాగాలను పరిశీలించారు. సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. ASP చైతన్య రెడ్డి, CI రామన్, SHO రంజిత్ పాల్గొన్నారు.
Similar News
News March 15, 2026
Breaking: కొత్త చిక్కుల్లో తాండూరు మాజీ MLA

తాండూరు మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి పేరు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో MLAల కొనుగోలు కేసు, ఇప్పుడు ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతంతో ఆయన కొత్త చిక్కుల్లో పడ్డారు. ఈగల్ టీమ్ దాడులు, పోలీసులు పైలట్ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీనికితోడు పోలీసులపై కాల్పులు.. ఆ రివాల్వర్ కూడా అతడి సోదరుడు రితేశ్ రెడ్డిది అని వార్తలు రావడం గమనార్హం.
News March 15, 2026
ఖమ్మం: తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం

కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో బొలెరో వాహనం పల్టీ కొట్టడంతో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదుటి వాహనాన్ని తప్పించబోయే సమయంలో నియంత్రణ కోల్పోయి ప్రమాదం సంభవించింది. ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. టైల్స్ లోడుతో బొలెరో హైదరాబాద్ నుంచి అశ్వరావుపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయమాదారానికి చెందినవారని సమాచారం.
News March 15, 2026
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.182 నుంచి రూ.186, మాంసం రూ.264 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


