News November 18, 2025
నాగర్కర్నూల్లో ‘చలి పంజా’

నాగర్కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కల్వకుర్తి మండలం తోటపల్లిలో అత్యల్పంగా 12.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్, వెల్దండలలో 13.0 డిగ్రీలు, ఎల్లికల్లో 13.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో అధిక చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Similar News
News November 18, 2025
MBNR: నవోదయ పరీక్ష హాల్టికెట్లు విడుదల

బండమీదిపల్లి, వట్టెం జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న జరగనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్టికెట్లను https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జానకిరాములు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలను 29 కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News November 18, 2025
MBNR: నవోదయ పరీక్ష హాల్టికెట్లు విడుదల

బండమీదిపల్లి, వట్టెం జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న జరగనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్టికెట్లను https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జానకిరాములు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలను 29 కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News November 18, 2025
NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4 నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా.. తమకేం తెలవదని వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకు ముందు నిరసన తెలిపారు.


