News November 18, 2025
ధర్వేశిపురం ఎల్లమ్మకు మంగళవారం ప్రత్యేక పూజలు

కనగల్ మండలం ధర్వేశిపురంలో వెలసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు, మంగళహారతులు నిర్వహించారు. భజన బృందం ఆలాపనతో ఆలయ ప్రాంగణమంతా భక్తి వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Similar News
News November 18, 2025
‘రాయలసీమ’ పేరుకు నేటికి 97 ఏళ్లు!

బ్రిటిష్ కాలంలో ‘దత్త మండలం’గా పిలవబడిన మన ప్రాంతానికి ‘రాయలసీమ’ అనే పేరు పెట్టి నేటికి 97ఏళ్లు పూర్తయ్యాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు ఈ పేరును ప్రతిపాదించారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలుకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ‘‘రాయలసీమ’’ అనే పేరును ప్రతిపాదించారు. పప్పూరు రామాచార్యులు ఈ ప్రతిపాదనను బలపరచగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
News November 18, 2025
‘రాయలసీమ’ పేరుకు నేటికి 97 ఏళ్లు!

బ్రిటిష్ కాలంలో ‘దత్త మండలం’గా పిలవబడిన మన ప్రాంతానికి ‘రాయలసీమ’ అనే పేరు పెట్టి నేటికి 97ఏళ్లు పూర్తయ్యాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు ఈ పేరును ప్రతిపాదించారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలుకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ‘‘రాయలసీమ’’ అనే పేరును ప్రతిపాదించారు. పప్పూరు రామాచార్యులు ఈ ప్రతిపాదనను బలపరచగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
News November 18, 2025
KMR: పలువురిని ఆకట్టుకున్న విద్యార్థిని సందేశం

కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో డ్రగ్స్ పై ఏఎస్పీ చైతన్య రెడ్డి అడిగిన ప్రశ్నకు ఓ విద్యార్థి ఇచ్చిన సమాధాన సందేశం పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థులు యువత డ్రగ్స్ ఎందుకు తీసుకోకూడదు విద్యార్థిని వివరించింది. “దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు,యువతే ముఖ్య కారణం,అలాంటి యువత IAS,IPSలు కాకుండా అడ్డుకునేది డ్రగ్స్” అని సందేశం ఇచ్చారు.


