News November 19, 2025
ఆన్లైన్లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్లైన్లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్లైన్లో అసభ్య మెసేజ్లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.
Similar News
News March 13, 2026
IPL SPECIAL: 2 నెలలు పండగే!

ఈనెల 28 నుంచి ఐపీఎల్ సందడి మొదలుకానుంది. ఈసారి రికార్డు స్థాయిలో 84 మ్యాచ్లు జరగనుండటంతో అభిమానులకు 2 నెలల పాటు వినోదం గ్యారంటీ. లీగ్ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన సీజన్ కానుంది. అలాగే ఆటను మరింత రంజుగా మార్చే ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ 2027 వరకు కొనసాగుతుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇవి క్రికెట్ అభిమానులకు మరింత ఆసక్తికర మ్యాచ్లను అందించనున్నాయి.
News March 13, 2026
వారిద్దరూ పార్టీని చీల్చారు: దేవ్జీ

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి వెనక పెద్ద కుట్ర ఉందని ఇటీవల లొంగిపోయిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అన్నారు. ఆపరేషన్ కగార్ ప్రారంభం కాగానే నంబాల బాడీగార్డులు లొంగిపోయి ఇన్ఫార్మర్లుగా మారారని ఆరోపించారు. కీలక నేతలైన మల్లోజుల, ఆశన్న శత్రువులకు లొంగిపోయి ఆయుధాలు అప్పగించారని పేర్కొన్నారు. వీరిద్దరూ పార్టీని చీల్చారని ఆరోపించారు. తాము మాత్రం ఆయుధాలను అడవుల్లోనే వదిలేశామని చెప్పారు.
News March 13, 2026
ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధమైంది: ట్రంప్

తాము చేస్తున్న దాడులకు భయపడిపోయి ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధమైందని US అధ్యక్షుడు ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. 2 రోజుల కిందట G-7 దేశాల నేతలతో జరిగిన వర్చువల్ చర్చల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని Axios వెల్లడించింది. యుద్ధం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించేందుకూ ఇరాన్లో అధికారులెవరు బతికి లేరని ట్రంప్ చెప్పారు. ‘లీడర్ అంటూ ఎవరూ లేరు. అందుకే లొంగిపోవడం గురించి ఎవరూ ప్రకటించలేదు’ అని పేర్కొన్నారు.


