News November 19, 2025
మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.
Similar News
News March 21, 2026
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

పరవాడ మండలం బొట్టవానిపాలెం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. బొట్టవానిపాలెం గ్రామానికి చెందిన బొట్టా రమణమ్మ (56) పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
News March 21, 2026
KNR: అమలుకు నోచుకోని రాజీవ్ యువ వికాసం..!

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు నోచుకోక నిరుద్యోగుల్లో నిరాశ పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 1,44,640 మంది యువత దరఖాస్తు చేసుకోగా, KNRలో 42,565, పెద్దపల్లిలో 47,470, జగిత్యాలలో 31,128, రాజన్న సిరిసిల్లలో నమోదు చేసుకున్నారు. స్వయం ఉపాధికి రూ.3 లక్షల వరకు సాయం ప్రకటించినప్పటికీ, సంవత్సరం గడిచినా పురోగతి కనిపించక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News March 21, 2026
తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న CM చంద్రబాబు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా CM చంద్రబాబు శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. వైకుంఠ 1 నుంచి క్యూ లైన్లో స్వామి వారి మహాద్వారం వద్దకు రాగా అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని ఆలయంలోకి వెళ్లారు.


