News November 19, 2025
మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.
Similar News
News March 4, 2026
HNK: ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్కు 98% హాజరు

నేడు జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్కు 98% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 17879, ఒకేషనల్ 1017కి 18475 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. జనరల్ విద్యార్థులు 401, ఒకేషనల్ విద్యార్థులు 20 మంది ఆబ్సెంట్ అయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 98గా నమోదు అయిందని, ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
News March 4, 2026
బిహార్ సీఎంగా బీజేపీ నేత?

బిహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. CM నితీశ్ను రాజ్యసభకు పంపే యోచనలో JDU ఉన్నట్లు సమాచారం. ఆయనకు BJP కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించనుందని తెలుస్తోంది. బిహార్ CMగా బీజేపీ నేతకు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీయూ 85 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.
News March 4, 2026
అరుదైన రికార్డుకు వికెట్ దూరంలో బుమ్రా

రేపు T20 WCలో ఇంగ్లండ్తో జరిగే మ్యాచులో బుమ్రా ఒక్క వికెట్ తీస్తే ఓవరాల్గా 500 వికెట్ల క్లబ్లో చేరనున్నారు. దీంతో ఈ రికార్డ్ సృష్టించిన 8వ భారత బౌలర్గా నిలుస్తారు. ఇప్పటివరకు Tests 234, ODIs 149, T20 116 వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్లలో కుంబ్లే(956) అత్యధిక వికెట్ టేకర్ కాగా తర్వాతి స్థానాల్లో అశ్విన్(765), హర్భజన్(717), కపిల్(687), జడేజా(634), జహీర్ ఖాన్(610), శ్రీనాథ్(551) ఉన్నారు.


