News November 19, 2025
HYD: కేంద్రమంత్రికి చనగాని దయాకర్ బహిరంగ లేఖ

కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐఐఎంలు, ఐఐటీలు, పెట్రోలియం సంస్థలతోపాటు ఇతర కేంద్రీయ విద్యా సంస్థలను తక్షణమే మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర అనుమతిని మంజూరు చేయించాలని అభ్యర్థించారు.
Similar News
News March 20, 2026
మడకశిర: అర్ధరాత్రి యాక్సిడెంట్.. యువకుడి మృతి

మడకశిర మండలం అయ్యవారిపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు.. చీపులేటి గ్రామనికి చెందిన తిప్పేస్వామి, చంద్రమౌళి బైక్పై వెళుతుండగా మార్గంమధ్యంలో ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిప్పేస్వామి మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 20, 2026
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు..!

అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా గడచిన 24 గంటల్లో వి.కోట, గుడుపల్లె మినహా మిగిలిన 26 మండలాల్లో వర్షం కురిసింది. గంగవరంలో 39.4 mm, పలమనేరులో 37.8 mm వర్షపాతం నమోదైంది. మండలాలు వారీగా.. యాదమరిలో 28.0, పూతలపట్టు, రొంపిచెర్ల మండలాల్లో 24.2, పెనుమూరులో 23.2, వెదురుకుప్పంలో 22.2, బైరెడ్డిపల్లిలో 17.2, గుడిపాలలో 12.4, పాలసముద్రం, విజయపురం మండలాల్లో 12.2, చిత్తూరు రూరల్ లో 10.6 mm వర్షపాతం నమోదు అయింది.
News March 20, 2026
నెల్లూరు: సమస్యలు మెయిల్ చేయాలని STలకు సూచన

నెల్లూరు కలెక్టరేట్లో గిరిజనుల సమస్యలపై చర్చ జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్య సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో మూడు ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకు సిఫార్సు చేశామని చెప్పారు. గిరిజనులు తమ సమస్యలను ఈమెయిల్ ద్వారా చెప్పాలని కోరారు.


