News November 19, 2025
HYD: కేంద్రమంత్రికి చనగాని దయాకర్ బహిరంగ లేఖ

కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐఐఎంలు, ఐఐటీలు, పెట్రోలియం సంస్థలతోపాటు ఇతర కేంద్రీయ విద్యా సంస్థలను తక్షణమే మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర అనుమతిని మంజూరు చేయించాలని అభ్యర్థించారు.
Similar News
News March 19, 2026
వార్ ఎఫెక్ట్.. పెరగనున్న సిమెంట్ ధరలు?

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల ప్రభావం దేశంలోని సిమెంట్ ధరలపైనా పడే అవకాశం ఉంది. MAR నెలాఖరు లేదా APR మొదటి వారంలో ధరలు పెరగొచ్చని నువామా రిపోర్ట్ వెల్లడించింది. పెట్కోక్, ప్యాకేజింగ్ ధరలు పెరుగుతుండటంతో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు డీలర్లు ప్రైస్ పెంచొచ్చని తెలిపింది. సిమెంట్ తయారీకి వాడే పెట్రోలియమ్ కోక్ (పెట్ కోక్)ను చమురు నుంచి వెలికితీస్తారు. క్రూడ్ ధరల హైక్తో పెట్ కోక్ ధరలూ పెరుగుతున్నాయి.
News March 19, 2026
మంత్రి పదవి నాకు కొత్త కాదు: గంటా

మంత్రి పదవి తనకు కొత్త కాదని, గతంలోనూ ఆ బాధ్యతలు నిర్వహించానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం సంపత్ వినాయక ఆలయాన్ని దర్శించుకున్న ఆయన.. మంత్రివర్గ విస్తరణ వార్తలపై స్పందించారు. ఎవరిని మంత్రిగా తీసుకోవాలో సీఎం చంద్రబాబుకు పూర్తి స్పష్టత ఉంటుందని, సరైన సమయంలో ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుతానికి ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని గంటా స్పష్టం చేశారు.
News March 19, 2026
ప.గో: 19 రోజుల తర్వాత స్వదేశానికి భౌతికకాయం

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) ఈనెల 1 న కువైట్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో విమానాల రాకపోకలు లేకపోవడంతో కువైట్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. ఇండియన్ ఎంబసీ చొరవతో పోస్ట్ మార్టం అనంతరం 19 రోజుల తర్వాత మృతదేహాన్ని గురువారం కార్గో విమానంలో హైదరాబాద్ తరలించనున్నారు. శుక్రవారం పాలకొల్లు చేరనుంది.


