News November 18, 2025
17 ఏళ్ల వయసులోనే దళంలోకి..

ఎన్కౌంటర్లో మృతి చెందిన <<18318593>>హిడ్మా<<>> గురించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోలు నడిపే స్కూళ్లో చదివి, 1996-97 మధ్య 17 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లాడు. ఏడో తరగతి వరకే చదివినా.. ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్లలో దిట్ట. అంచెలంచెలుగా ఎదిగి.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా మారాడు.
Similar News
News November 18, 2025
కల్వకుర్తి: పత్తి రైతుల సమస్యలు పాలకులకు పట్టవా?: మాజీమంత్రి

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కల్వకుర్తి పట్టణంలోని కాటన్ మిల్లు వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి మంగళవారం ఆయన నిరసన తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ప్రస్తుతం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
News November 18, 2025
కల్వకుర్తి: పత్తి రైతుల సమస్యలు పాలకులకు పట్టవా?: మాజీమంత్రి

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కల్వకుర్తి పట్టణంలోని కాటన్ మిల్లు వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి మంగళవారం ఆయన నిరసన తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ప్రస్తుతం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
News November 18, 2025
5 రోజుల్లో రూ.5వేలు తగ్గిన ధర.. కారణమేంటి?

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల <<18318028>>పతనం కొనసాగుతోంది<<>>. 5 రోజుల్లోనే 10గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5వేలు, కేజీ వెండి రేటు రూ.15వేల వరకు తగ్గింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదనే అంచనాలతో గోల్డ్కు డిమాండ్ తగ్గినట్లు నిపుణుల అంచనా. అలాగే US డాలర్ బలపడటమూ ఓ కారణమని చెబుతున్నారు. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు గోల్డ్ ధరలను ప్రభావితం చేసే విషయం తెలిసిందే.


