News November 18, 2025
ములుగు: మావోయిస్టు హిడ్మా నేపథ్యం!

ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. సుక్మాలోని పూర్వర్తికి చెందిన మడవి హిడ్మాపై రూ.కోటి రివార్డు సైతం ఉంది. చిన్నతనంలోనే మావో సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. ఏరియా కమిటీలో, DVCM(డివిజనల్ కమిటీ సభ్యుడు), DKSZC(దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ) తర్వాత సీసీ కమిటీ మెంబర్గా ప్రస్తుతం కొనసాగాడు.
Similar News
News November 18, 2025
TML: టోకెన్లు లేకుండా శ్రీనివాసుడి దర్శనం

తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి టీటీడీ ప్రాధాన్యమిచ్చింది. గత అనుభవాల దృష్ట్యా ఆఫ్లైన్ టోకెన్లను పూర్తిగా రద్దు చేసింది. కొండకు వచ్చిన వాళ్లు వచ్చినట్లు నేరుగా దర్శనానికి వెళ్లిపోవచ్చు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల్లో 182 గంటల పాటు ఉంటుంది. ఇందులో 164 గంటలు సామాన్య భక్తులనే అనుమతిస్తారు. ఇదే సమయంలో ఎక్కువ టైం షెడ్డుల్లో ఉంచకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
News November 18, 2025
TML: టోకెన్లు లేకుండా శ్రీనివాసుడి దర్శనం

తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి టీటీడీ ప్రాధాన్యమిచ్చింది. గత అనుభవాల దృష్ట్యా ఆఫ్లైన్ టోకెన్లను పూర్తిగా రద్దు చేసింది. కొండకు వచ్చిన వాళ్లు వచ్చినట్లు నేరుగా దర్శనానికి వెళ్లిపోవచ్చు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల్లో 182 గంటల పాటు ఉంటుంది. ఇందులో 164 గంటలు సామాన్య భక్తులనే అనుమతిస్తారు. ఇదే సమయంలో ఎక్కువ టైం షెడ్డుల్లో ఉంచకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
News November 18, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ఆదోనిలోని NDBL జిన్నింగ్ & ప్రెస్సింగ్, దాదా పీర్ మిల్ యూనిట్లలో CCI ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ఏ.సిరి మంగళవారం పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డ్ అధికారులతో కలిసి కోనుగోలు కేంద్రాల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న వాటిపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించా. ఆమెతో పాటు జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మీ ఉన్నారు.


