News April 13, 2024
చీరాల: ఇసుకలో మృతదేహం.. స్పందించిన నారా లోకేశ్

మండలంలోని ఈపూరుపాలెంలో ఇసుక లోడ్లో మృతదేహం బయటపడిన ఘటనపై ట్విటర్(X) వేదికగా శనివారం TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇది ఇసుక మాఫియా పననే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన ఒక నిదర్శనమన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ భర్తలు తిరిగి వస్తారన్న నమ్మకం భార్యలకు లేకుండా పోయిందన్నారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయని విమర్శించారు.
Similar News
News March 7, 2026
10th పరీక్షల నిర్వహణపై కలెక్టర్, SP సమీక్ష

10వ తరగతి పరీక్షల నిర్వహణలోఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్తో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయని DEO తెలిపారు.
News March 7, 2026
ప్రకాశం: మహిళా దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

ప్రకాశం భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వేడుకలు ఘనంగా జరిపించాలని సూచించారు. రవాణా, భోజనం, సాంకేతిక ఏర్పాట్లలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
News March 7, 2026
సంతనూతలపాడు వద్ద రోడ్డు ప్రమాదం

సంతనూతలపాడు ఎండ్లూరు డొంక వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు భాగం దెబ్బ తిన్నది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


