News November 19, 2025

ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

image

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.

Similar News

News March 19, 2026

MBNR: రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా MLA యెన్నం శ్రీనివాసరెడ్డి

image

మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా శాసనసభలో నియమిస్తూ.. గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో ఆయనకు పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలలో మరింత కీలక బాధ్యతలు అప్పగించినట్లు భావిస్తున్నారు. MLA కొంతకాలంగా పార్టీకి విశేష సేవలు అందిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొన్నారు. పనితీరును గుర్తించి ప్రభుత్వం విఫ్‌గా నియమించింది.

News March 19, 2026

MBNR: ఉగాది వేళ మన్యంకొండకు భక్తుల రద్దీ

image

నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దర్శనం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.

News March 19, 2026

MBNR: ఉగాది, రంజాన్ EFFECT.. రద్దీ

image

ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ వైపు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం ఉగాది, శనివారం రంజాన్ కావడంతో మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుని ఊర్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పడింది.