News November 19, 2025
PDPL: డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే చెప్పండి: కలెక్టర్

PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిరోధంపై ఆయన నిన్న ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తాయని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2026
మార్చి 21: చరిత్రలో ఈ రోజు

1857: జపాన్లో భారీ భూకంపం.. 100,000 మంది మృతి
1916: షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం
1970: నటి శోభన జననం(ఫొటోలో)
1978: బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ జననం
1990: అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి మరణం
2022: రంగస్థల నటుడు, దర్శకుడు తల్లావజ్జుల సుందరం మరణం
*ప్రపంచ అటవీ దినోత్సవం
*ప్రపంచ కవితా దినోత్సవం
News March 21, 2026
కీచక జ్యోతిషుడితో లింక్స్.. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాజీనామా

నాసిక్(MH) <<19426361>>జ్యోతిషుడు<<>> అశోక్ కారత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతడితో ఉన్న ఫొటోలు, లింక్స్ బయటపడటంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రూపాలి చకన్కర్ రాజీనామా చేశారు. అంతకుముందు ఆ పదవి నుంచి దిగిపోవాలని MH సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రూపాలి ఈ నెల 18 నుంచి ఆఫీసుకు వెళ్లడం లేదని తెలిసింది.
News March 21, 2026
అనకాపల్లి: స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో 4గురు కేంద్ర మంత్రులు

నక్కపల్లిలో ఈనెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదగా జరిగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో నలుగురు కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ,పి. చంద్రశేఖర్ పాల్గొనున్నారు. వీరితో పాటు స్టీల్ కార్యదర్శి సందీప్ పాండ్రిక్ హాజరవుతారు.


