News November 19, 2025
మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.
Similar News
News March 12, 2026
ఖమ్మంలో ‘మాంగళ్య’.. ముఖ్య అతిథిగా శ్రీలీల

వస్త్ర ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్ తన 30వ బ్రాంచ్ను ఈ నెల 13న(రేపు) ఖమ్మంలో ప్రముఖ సినీనటి శ్రీలీలతో ప్రారంభించనున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అత్యాధునిక వెడ్డింగ్ కలెక్షన్లతో పాటు అన్ని వయసుల వారికి నచ్చే లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకే అందిస్తూ ప్రజలకు మంచి షాపింగ్ అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
News March 12, 2026
వరంగల్లో ఇక BRSకు రెండు సీట్లు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యపై స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్, జనగామలో BRS ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. ఇటీవల ఘన్పూర్ MLA కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ BRS తరఫున MLA వివేకానంద గౌడ్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ తుది తీర్పు ప్రకటిస్తూ, కడియం శ్రీహరి BRSలోనే ఉన్నారంటూ ప్రకటించడంతో ఆ పార్టీకి రెండు స్థానాలున్నట్లు తేలింది.
News March 12, 2026
NLG: మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రెండో విడతలో ఆర్టీసీ అద్దె బస్సుల పథకాన్ని అమలు చేయనుంది. త్వరలోనే నల్లగొండ రీజియన్ పరిధిలో బస్సుల పంపిణీకి మార్గదర్శకాలు రానున్నాయి. ఒక్కో జిల్లాకు 150 సంఘాలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో బస్సులు కేటాయించారు.


