News November 19, 2025

ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం

image

ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. పాలక మండలి పదవీ కాలం కేవలం 2 నెలలు మాత్రమే ఉండటంతో పలు నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశం కీలకం కానుందని సమాచారం. తమ డివిజన్లలో సమస్యలను పరిష్కరించాలంటూ కార్పొరేటర్లు డిమాండ్ చేసే అవకాశముంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ అధిక నిధులు విడుదల చేశారని.. తమకు కూడా విడుదల చేయాలని కోరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News

News March 18, 2026

మూసీ ప్రక్షాళన: ఇళ్లు కూల్చకండి.. మురికిని వదలకండి!

image

ఏళ్లు గడుస్తున్నా మూసీలో మురుగు కంపు తగ్గలేదు కానీ, ప్రచార ఆర్భాటం మాత్రం పెరిగిపోయింది. గత 12 ఏళ్లలో నిధుల కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయని హైదరాబాద్ సిటిజన్ ఫోరం గళమెత్తింది. సుందరీకరణ పేరుతో వేలాది ఇళ్లను కూల్చడం సరికాదని, బఫర్ జోన్ సాకుతో పేదలను రోడ్డున పడేయొద్దని డిమాండ్ చేస్తోంది. అభివృద్ధి అంటే ఇళ్లు కూల్చడం కాదు, నదిని శుద్ధి చేయడం అని ఫోరం స్పష్టం చేసింది.

News March 18, 2026

మూసీ ప్రక్షాళన: ఇళ్లు కూల్చకండి.. మురికిని వదలకండి!

image

ఏళ్లు గడుస్తున్నా మూసీలో మురుగు కంపు తగ్గలేదు కానీ, ప్రచార ఆర్భాటం మాత్రం పెరిగిపోయింది. గత 12 ఏళ్లలో నిధుల కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయని హైదరాబాద్ సిటిజన్ ఫోరం గళమెత్తింది. సుందరీకరణ పేరుతో వేలాది ఇళ్లను కూల్చడం సరికాదని, బఫర్ జోన్ సాకుతో పేదలను రోడ్డున పడేయొద్దని డిమాండ్ చేస్తోంది. అభివృద్ధి అంటే ఇళ్లు కూల్చడం కాదు, నదిని శుద్ధి చేయడం అని ఫోరం స్పష్టం చేసింది.

News March 18, 2026

HYD: రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

image

SM వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సెక్యూరిటీ గార్డు వెంకన్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు చెందిన సోషల్ మీడియా ‘రీల్’ కింద ఇతడు అత్యంత అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ PSకి తరలించి విచారణ చేస్తున్నారు.