News November 19, 2025

కాకినాడ మీదుగా శ్రీలంక వెళ్లాలనుకున్న హిడ్మా?

image

AP: వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో దండకారణ్యం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కొద్దిమంది అనుచరులతో కలిసి శ్రీలంకలో తలదాచుకోవాలని భావించాడని సమాచారం. కాకినాడ పోర్టు నుంచి సముద్రమార్గంలో వెళ్లేందుకు ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో దండకారణ్యం నుంచి బయటికొచ్చిన హిడ్మా మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని తెలుస్తోంది.

Similar News

News March 19, 2026

అరుదైన బ్లడ్ గ్రూప్.. 50 మందికి మాత్రమే!

image

మనందరిలో ప్రధానంగా నాలుగు గ్రూపుల రక్తం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఉండే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ‘Rh-Null’ అనే విషయం మీకు తెలుసా? దీనినే ‘గోల్డెన్ బ్లడ్’ అని పిలుస్తారు. ఇందులో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు, అందుకే ఈ రక్తం ఎవరికైనా సెట్ అవుతుంది. కానీ వీరికి రక్తం కావాలంటే మాత్రం దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 19, 2026

జ్యోతిషుడు అరెస్టు.. మహిళలతో 58 అసభ్యకర వీడియోలు

image

మహారాష్ట్రలో ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ లాంటి ఘటన సంచలనం రేపుతోంది. నాసిక్‌కు చెందిన జ్యోతిషుడు అశోక్ కారత్‌ తన వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడని పోలీసులు గుర్తించారు. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ దోపిడీ చేసేవాడన్నారు. అతడిని అరెస్టు చేసి 58 అసభ్యకర వీడియోలను సీజ్ చేశారు. అశోక్ గతంలో నేవీలో పని చేశాడు. ఇతడికి MH రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నాయి.

News March 19, 2026

సరఫరా కాదు డిస్ట్రిబ్యూషన్‌లోనే సమస్య: కేంద్రం

image

దేశంలో LPG సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని.. డిస్ట్రిబ్యూషన్‌లోనే సమస్య ఉందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే క్షేత్రస్థాయిలో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొంది. దీనిపై డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్రాలకు అప్పీల్ చేశామని తెలిపింది. నిన్న టోటల్ బుకింగ్స్ 56లక్షలుగా ఉండగా సప్లై సంఖ్య 54,91,000గా ఉన్నట్లు తెలిపింది.