News April 13, 2024

తిరుమల పవిత్రతను వైసీపీ మంటగలిపింది: పవన్ కళ్యాణ్

image

AP: టీటీడీ నిధులను అడ్డగోలుగా వాడుకునే కుట్రలకు వైసీపీ నాయకులు తెరతీశారని, ఈ అంశంపై సమగ్ర సమాచారం తమ వద్ద ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. తిరుమల పవిత్రతను రాష్ట్ర ప్రభుత్వం మంటగలిపిందని విమర్శించారు. తులసి వనం లాంటి తిరుపతిని గంజాయి వనం చేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. తిరుపతిలో దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని కూటమి నాయకులకు సూచించారు.

Similar News

News March 17, 2026

హైదరాబాద్‌లో UK స్కూల్స్!

image

TG: హైదరాబాద్‌లో యునైటెడ్ కింగ్‌డమ్(UK)కు చెందిన 13 ప్రఖ్యాత స్కూల్స్ తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. ఇందులో భాగంగా యూకే డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 18న రాష్ట్రంలో పర్యటించనుంది. ఎక్కడెక్కడ క్యాంపస్‌లు నెలకొల్పాలనే దానిపై రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరపనుంది.

News March 17, 2026

IPL స్కోర్‌కార్డ్స్.. ఏది నచ్చింది?

image

ఐపీఎల్ అంటే ఆట మాత్రమే కాదు.. స్క్రీన్‌పై కనిపించే స్కోర్‌కార్డ్ గ్రాఫిక్స్ కూడా స్పెషలే. 2008 నుంచి 2025 వరకు వీటి డిజైన్లు మారుతూ వచ్చాయి. 2014-15 నాటి గ్లాసీ లుక్, 2016 నాటి ఫ్యూచరిస్టిక్ డిజైన్లు ‘బెస్ట్’ అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే 2011-12 నాటి పాత డిజైన్లు, 2023-24లో వాడిన ఇటాలిక్ ఫాంట్లు అంతగా ఆకట్టుకోలేదంటున్నారు. పాత డిజైన్లకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఇంతకీ మీ ఫేవరెట్ ఏది? COMMENT

News March 17, 2026

రేపటి నుంచే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

image

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు. బస్సు ఎక్కేటప్పుడు PHC పాస్/వికలాంగుల కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని RTC సూచించింది.