News November 18, 2025
తిరుపతి జనాభా ఇలా పెరుగుతోంది..!

తిరుపతి 1886లో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడింది. అప్పటి నగర జనాభా కేవలం 2,600 మాత్రమే. 1941 నాటికి ఇది 28వేలకు చేరింది. తదుపరి దశల్లో 46వేలకు పెరిగింది. 1970లో జనాభా లక్షకు చేరువైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తిరుపతిలో ప్రస్తుత జనాభా 3,77,000గా ఉంది. రోజుకు లక్ష మంది భక్తులు వస్తున్నారు. 1977 తర్వాత తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందింది. పలు గ్రామాల నుంచి జనాలు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు.
Similar News
News November 18, 2025
అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

హరియాణా ఫరిదాబాద్లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.
News November 18, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> రౌడీ షీటర్లకు పాలకుర్తి సీఐ కౌన్సిలింగ్
> నవాబుపేట రిజర్వాయర్లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే కడియం
> కేంద్ర మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న జనగామ కలెక్టర్
> జనగామలో యువ వికసిత భారత్ 2k రన్
> ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
> మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించిన ఆర్డీవో
> జనగామకు జల సంచాయ్ జన్ భగీరథి అవార్డు
News November 18, 2025
తరాలకు మార్గదర్శకంగా సత్యసాయి బాబా జీవితం: మోదీ

AP: రేపు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నానని పీఎం మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం సత్యసాయి జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. సత్యసాయి బాబాతో సంభాషించడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు తనకు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే సచిన్ పుట్టపర్తికి చేరుకున్నారు.


