News November 19, 2025
PDPL: డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే చెప్పండి: కలెక్టర్

PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిరోధంపై ఆయన నిన్న ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తాయని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 11, 2026
అంగీకారంతో జరిగితే దాన్ని రేప్ అనలేం: కర్ణాటక హైకోర్టు

అంగీకారంతో కొన్నేళ్లపాటు రిలేషన్షిప్లో ఉండి ఆపై పెళ్లికి నిరాకరిస్తే రేప్గా పరిగణించలేమని కర్ణాటక HC స్పష్టం చేసింది. ‘‘చట్టం ప్రకారం ‘హార్ట్బ్రేక్’ నేరం కాదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పైగా విదేశాల్లో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే అది మోసం కిందకు రాదంటూ నిందితుడిపై కేసును కొట్టివేసింది. కేవలం పెళ్లి చేసుకోలేదన్న కారణంతో అంగీకారంతో కూడిన బంధాన్ని రేప్గా మార్చలేమని కోర్టు తేల్చిచెప్పింది.
News March 11, 2026
పొద చిక్కుడులో కాయతొలిచే పురుగు నివారణ

పొద చిక్కుడు పూత, కాయ దశల్లో కాయతొలిచే పురుగు ఆశించి కాయలోని పదార్థాలను తినేస్తుంది. దీని వల్ల కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. కాయతొలిచే పురుగు నివారణకు ఫ్లూబెండమైడ్ 39.35% ఎస్.సి. 60 మి.లీ. లేదా క్లోరంత్రానిలిప్రోల్ 18.5% ఎస్.సి. 60 మి.లీ. లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 60 మి.లీ.తో పాటు జిగురు 100 మి.లీ. కలిపి ఎకరానికి సరిపడా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
News March 11, 2026
సింగరేణికి ‘గని’ గండం.. నాలుగేళ్లలో మరో 10 మూత?

సింగరేణి సంస్థకు మరో నాలుగేళ్లలో గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. 2030 నాటికి మరో 10 గనులు మూతపడే అవకాశం ఉంది. సంస్థలో ఒకప్పుడు 56 భూగర్భ గనుల్లో 1.20 లక్షల మంది పని పనిచేసేవారు. ప్రస్తుతం సంస్థ వ్యాప్తంగా 12 ఏరియా ,18 ఓపెన్ కాస్ట్,19 భూగర్భ గనులలో సుమారు 39వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకి 2.40 లక్షల టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉండగా 1.50 లక్షల టన్నులు మాత్రమే తీస్తున్నారు.


