News November 19, 2025
తిరుపతి రైతులకు నేడు నగదు జమ

తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుంది.
Similar News
News March 6, 2026
యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడి గుడ్ల ధర!

అమెరికా-ఇజ్రాయెల్vsఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలోని పౌల్ట్రీ రంగంపైనా పడింది. రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్ల నిల్వలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించగా, స్థానిక మార్కెట్లలో రూ.3.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.
News March 6, 2026
బెంబేలెత్తించిన బెథెల్

T20WC: సెమీఫైనల్లో భారత్ గెలిచినా ఇంగ్లండ్ బ్యాటర్ బెథెల్ మనసులు గెలిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తన దూకుడును ఎక్కడా తగ్గించలేదు. వరుసగా సిక్సర్లు, ఫోర్లు కొడుతూ భారత ఆటగాళ్లను, అభిమానులను వణికించారు. 48 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 105 రన్స్ చేశారు. బెథెల్ గ్రేట్ ఇన్నింగ్స్ ఆడారంటూ టీమ్ ఇండియా ఫ్యాన్స్ సైతం ప్రశంసిస్తున్నారు.
News March 6, 2026
తెలంగాణకు కొత్త గవర్నర్

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. ఇక TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్గా R.N. రవిని నియమించింది.


