News November 19, 2025

PDPL: డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే చెప్పండి: కలెక్టర్

image

PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిరోధంపై ఆయన నిన్న ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తాయని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 12, 2026

15 నుంచి ఒంటిపూట బడులు.. జీవో జారీ

image

TG: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ GO జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో APR 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతాయని పేర్కొంది. ఉ.8 గంటల నుంచి మ.12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. అయితే 15న ఆదివారం కావడంతో సోమవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. బోర్డ్ ఎగ్జామ్స్ దృష్ట్యా 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగుతాయని వెల్లడించింది.

News March 12, 2026

హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్

image

పాత ఆస్తి పన్ను బకాయిలు ఉన్న నగరవాసులకు జీహెచ్‌ఎంసీ భారీ ఊరటనిస్తూ OTS పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని కేవలం మార్చి 31వ తేదీలోపు పన్ను చెల్లించిన వారు మాత్రమే పొందగలరని అధికారులు స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, MyGHMC యాప్, మీసేవ కేంద్రాల ద్వారా తమ బకాయిలను చెల్లించవచ్చు.
SHARE IT

News March 12, 2026

బాపట్ల: జిల్లాలో ఇంటర్ పరీక్షకు 155 మంది గైర్హాజరు

image

బాపట్ల జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ పరీక్షకు 155 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జుబేర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గురువారం నాడు ఇంటర్ పరీక్షకు 1,270 మంది హాజరు కావలసి ఉండగా 1115 మంది హాజరైనట్లు తెలిపారు. 155 మంది హాజరు కాలేదన్నారు. ఇంటర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.