News November 19, 2025
PDPL: డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే చెప్పండి: కలెక్టర్

PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిరోధంపై ఆయన నిన్న ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తాయని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 2, 2026
ఖమ్మం: ఆన్లైన్కే ప్రోగ్రెస్ కార్డులు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల పంపిణీకి విద్యాశాఖ స్వస్తి పలికింది. ఏళ్ల తరబడి సరఫరా నిలిచిపోవడంతో హెడ్ మాస్టర్లు సొంత ఖర్చులతో కార్డులు కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ భారాన్ని తగ్గిస్తూ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక కేటగిరీ, ఆరు నుంచి పదో తరగతి వరకు మరో కేటగిరీగా విభజించి ఇకపై కేవలం ఆన్లైన్ ద్వారానే ఫలితాల కార్డులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
News April 2, 2026
సాగర్ రికార్డు ‘పవర్’: రాష్ట్రంలోనే నంబర్ 1

జలవిద్యుత్ ఉత్పత్తిలో సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నయా రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసిన కేంద్రంగా నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఏకంగా 2,572.04 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి సాగర్ తన సత్తా చాటిందని జెన్కో CE మంగేష్ కుమార్ వెల్లడించారు. 22 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అత్యధిక ఉత్పత్తి జరగడం విశేషం.
News April 2, 2026
భద్రాద్రి జిల్లాలో తునికాకు మోడెం పనులు ప్రారంభం

భద్రాద్రి జిల్లాలో తునికాకు సేకరణకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆకు చిగురించడం కోసం చేపట్టే మోడెం (ప్రూనింగ్) పనులను అటవీశాఖ ప్రారంభించింది. జిల్లాలోని 31యూనిట్ల పరిధిలో 25,900స్టాండర్డ్ బ్యాగుల సేకరణను లక్ష్యంగా నిర్దేశించారు. వారం రోజుల పాటు ప్రూనింగ్ పనులు నిర్వహించి, ఈ నెల చివరలో ఆకు సేకరణ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం డివిజన్లలో ఈ పనులు సాగుతున్నాయి.


