News April 13, 2024
నిజాంసాగర్: పల్టీకొట్టిన కారు

నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్రావు పల్లి జాతీయ రహదారిలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దెగ్లూర్ పట్టణానికి చెందిన ఫిజొద్దీన్ (22), అబ్దుల్ రజాక్ (22)కు గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారి సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వారిని హైవే అంబులెన్స్లో పిట్లం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
Similar News
News January 21, 2026
NZB: నకిలీ విదేశీ ఉద్యోగాల కేసులో నిందితుడి అరెస్టు

నకిలీ విదేశీ ఉద్యోగాల కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు NZB సైబర్ క్రైమ్ ACP వై. వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిందితుడు టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి మాటలను నమ్మి, విదేశాల్లో అధిక జీతంతో ఉద్యోగాలు ఉన్నాయంటూ మోసాగిస్తున్నాడన్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
News January 21, 2026
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు కమ్మర్పల్లి విద్యార్థినులు

కమ్మర్పల్లి ZPHS విద్యార్థినులు క్రీడల్లో సత్తా చాటారు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-17 పోటీలకు ఈ పాఠశాలకు చెందిన భవాని, వర్షిత్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సాయన్న, PD వేముల నాగభూషణం తెలిపారు. మినీ స్టేడియంలో జరిగిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన వీరు, త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
News January 21, 2026
NZB: పోలీస్ అధికారులతో CP సమీక్ష

నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ అధికారులంతా బాధ్యతగా పని చేయాలని సూచించారు. అలాగే సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని ఆదేశించారు. పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ACP రాజా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


