News April 13, 2024

కొత్తవలస: ఎమ్మార్వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ మృతి

image

కొత్తవలస ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇబ్రహీం (33) శనివారం సాయంత్రం మృతి చెందారు. కొత్తవలస కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఎనిమిది నెలల క్రితమే విధుల్లోకి వచ్చారు. అనారోగ్య కారణంగా రెండు రోజులుగా విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎమ్మార్వో సిబ్బంది అతని కుటుంబానికి సంతాపం తెలిపారు.

Similar News

News March 4, 2026

VZM: ‘రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి’

image

జిల్లాలో జరుగుతున్న రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సిసిఎల్ఏ జి.జయలక్ష్మితో అమరావతి నుంచి బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రీసర్వే ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని, గడువులోగా రీసర్వేతో పాటు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

News March 4, 2026

ఈ నెల 8న ఘనంగా మహిళ దినోత్సవం: విజయనగరం కలెక్టర్

image

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్యాం సుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఆదివారం పోలీస్ బ్యారెక్స్‌లో జరిగే జిల్లా స్థాయి కార్యక్రమానికి సుమారు 3 వేల మంది మహిళలు హాజరవుతారని చెప్పారు. మహిళ పారిశ్రామిక వేత్తల సన్మానం, పథకాల స్టాల్స్, అసెట్స్ పంపిణీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News March 4, 2026

VZM: ‘లక్ష్యం మేరకు ఉద్యాన సాగు విస్తీర్ణం సాధించాలి’

image

జిల్లాలో ఉద్యాన పంటల సాగును లక్ష్యానికి అనుగుణంగా విస్తరించాలని జిల్లా కలెక్టర్ శ్యాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. రబీ సీజన్‌లో 4,500 ఎకరాలు సాధించామని, ఖరీఫ్‌లో 6,000 ఎకరాల లక్ష్యాన్ని మించి సాధించాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేసి, బోరు బావులు, బిందు సేద్యం సదుపాయాలు కల్పించాలని తెలిపారు.