News November 19, 2025
పద్మనాభంలో స్వామి ఉత్సవం ఎలా ప్రారంభమైంది?

పద్మనాభంలోని గిరి ప్రాంతంలో 1938లో విజయనగరం పాలకుడు పూసపాటి అలక్ నారాయణ గజపతి ఆనతి మేరకు ద్రాక్షారామం నుంచి వచ్చిన చేకూరి, బుల్లి సత్యనారాయణరాజు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి యజ్ఞాలు నిర్వహించేవారు. ఆఖరిరోజు అనంతుని కొండ మెట్ల పంక్తికి దీపోత్సవాన్ని నిర్వహించేవారు. కొంతకాలం ఉత్సవం నిలిచినా..1987లో ఆలయ అర్చకుడు కృష్ణమాచార్యుల సూచనల మేరకు పునఃప్రారంభించారు.
Similar News
News February 5, 2026
‘విశాఖ స్టీల్పై కేంద్ర దృక్పథం మారింది’

విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వ దృక్పథం అనుకూలంగా ఉందని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ తెలిపారు. అధికారులు, కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. RINLకి ఇంకా దేశవ్యాప్తంగా బ్రాండ్ విలువ ఉందన్నారు. రుణాల వడ్డీ 14% – 8.9% తగ్గిందని, ఉత్పత్తి ఖర్చులు మరింత తగ్గించే అవకాశం ఉందన్నారు. 2 నెలల్లో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తామని CMD మణీష్ రాజ్ గుప్తా పేర్కొన్నారు.
News February 5, 2026
విశాఖలో బార్లకు నేడే లక్కీ డ్రా

విశాఖలో 27 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి లాటరీని నేడు VMRDA చిల్డ్రన్స్ ఏరినాలో నిర్వహించనున్నారు. 52 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయగా 108 దరఖాస్తులు వచ్చాయి. ఒక బారు లైసెన్స్కు 4 దరఖాస్తులు వచ్చినపుడే లక్కీ డ్రా నిర్వహిస్తారు. 27 మద్యం బార్లకు మాత్రమే 4 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.22 కోట్లు ఆదాయం లభించిందని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు.
News February 5, 2026
తిరుమల లడ్డూ కల్తీ నిజమే: ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం వాస్తవమేనని MLA విష్ణు కుమార్ రాజు అన్నారు. గతంలో లడ్డూ తీసుకొస్తే 10 రోజుల పాటు సువాసన వచ్చేదని, ఐదేళ్లుగా లడ్డూను చూస్తేనే కల్తీ అయిందని అర్థమవుతోందన్నారు. YCP పాలనలో కొందరు నేతలు దారుణంగా మాట్లాడారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం పరిరక్షిస్తుందని
ఆయన స్పష్టం చేశారు.


