News April 14, 2024
19న చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈనెల 19న కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. ఆయన తరఫున సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. ఆరోజు ఉదయం కుప్పం లక్ష్మీపురంలోని శ్రీవరదరాజస్వామి ఆలయానికి చేరుకోకున్న భువనేశ్వరి.. నామినేషన్ పత్రాలకు పూజలు చేయించనున్నారు. అనంతరం పాతపేట చెరువుకట్ట కూడలి నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి చేరుకుంటారు.
Similar News
News March 14, 2026
పెట్రోల్, డీజిల్ను నిల్వ చేస్తున్నారా?

యుద్ధం కారణంగా ఇంధనం కొరత రావొచ్చనే భయంతో చాలా మంది పెట్రోల్, డీజిల్ను విడిగా తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం ప్రకటించింది. నిల్వల వల్ల అగ్ని ప్రమాదాలు జరగొచ్చని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపుకోవాలని సూచించింది.
News March 14, 2026
పెట్రోల్, డీజిల్ను నిల్వ చేస్తున్నారా?

యుద్ధం కారణంగా ఇంధనం కొరత రావొచ్చనే భయంతో చాలా మంది పెట్రోల్, డీజిల్ను విడిగా తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం ప్రకటించింది. నిల్వల వల్ల అగ్ని ప్రమాదాలు జరగొచ్చని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపుకోవాలని సూచించింది.
News March 14, 2026
రోహిత్కు హార్దిక్ వార్నింగ్?.. MI రియాక్షన్ ఇదే

ఈ ఏడాది IPL ప్రారంభానికి ముందు రోహిత్ శర్మకు MI కెప్టెన్ హార్దిక్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఓ స్పోర్ట్స్ అకౌంట్ ట్వీట్ చేసింది. హిట్ మ్యాన్ ప్రదర్శన సరిగా లేకపోతే సహించేది లేదని పాండ్య మేనేజ్మెంట్కు చెప్పినట్లు పేర్కొంది. దీనిపై MI స్పందించింది. ‘ఏమైనా రాసుకోవచ్చు’ అనే అర్థంలో నవ్వుతున్న ఎమోజీని పోస్టు చేసింది. ఇలాంటి రూమర్స్ను పుట్టించడం సాధారణమై పోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


