News April 14, 2024

అన్నపై దాడిని ఖండించిన చెల్లి షర్మిల

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడిని తన సోదరి వైఎస్ షర్మిల ఖండించారు. ప్రొద్దుటూరులో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రిపై జరిగిన రాయి దాడిని ఆమె దురదృష్టకరమైన ఘటన అంటూ ఖండిస్తూ ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని భావిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని స్పష్టం చేశారు.

Similar News

News March 16, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,670
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,416
* వెండి 10 గ్రాముల ధర రూ.2585.

News March 16, 2026

కడప: ఓపెన్ 10th పరీక్షలకు 388 విద్యార్థులు డుమ్మా.!

image

కడప జిల్లాలో సోమవారం 31 సెంటర్లలో ఓపెన్ 10th పరీక్షలను నిర్వహించారు. నేటి పరీక్షలకు 389 మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. 2261 మంది విద్యార్థులు తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా.. 1875 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉర్దూ పరీక్షకు 63 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 61 మంది పరీక్షలు రాశారు. జిల్లాలో రెగ్యులర్ 10th పరీక్షలు 167 సెంటర్లలో జరిగాయి. 27,838(100%) మంది విద్యార్థులు హాజరయ్యారు.

News March 16, 2026

కడప: పదో తరగతి ఎగ్జాం రూములోకి పాము

image

కడప జిల్లా బి.కోడూరులో పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న ఓ పరీక్షా కేంద్రంలోని రూములోకి పాము వచ్చింది. విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్కూల్ సిబ్బంది పామును చంపి బయట వేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు వెళ్లారు.