News April 14, 2024

జగన్‌పై దాడి.. ప్రకాశం జిల్లా నేతలు ఏమన్నారంటే?

image

సీఎం జగన్‌పై విజయవాడ బస్సు యాత్రలో దాడి జరిగిన విషయం తెలిసింది. దీనిపై ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు స్పందించారు. జగన్‌పై దాడి టీడీపీ మూకల పనేనని జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, శివ ప్రసాద్ అన్నారు. జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆధరణను చూసి ఓర్వలేక దాడి చేశారని జంకె వెంకటరెడ్డి, కేపీ నాగార్జునరెడ్డి, దద్దాల అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచి పరిణామాలు కాదని అన్నా రాంబాబు హితవు పలికారు.

Similar News

News March 17, 2026

ప్రకాశం: పంచాయతీలకు ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక అధికారులు

image

జిల్లాలో పంచాయితీ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఏప్రిల్ 2 నుంచి జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోందని DPO వెంకటేశ్వరరావు అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి అధికారుల ద్వారా పాలన సాగుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని 27 మండలాల్లో 519 పంచాయతీలు, మార్కాపురం జిల్లాలో 21 మండలాలకు 405 మంది అధికారులు ఉంటారన్నారు.

News March 17, 2026

2 నెలల పాపకు పేరు పెట్టిన ప్రకాశం JC

image

కురిచేడు మండలానికి చెందిన చెంచు కుటుంబాలు 29 మంది నాగర్ కర్నూలు (D) బొగ్గుల బట్టిలో పదేళ్లుగా బానిస కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ విషయం స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. <<19399497>>స్పందించిన అధికారులు<<>> సోమవారం వీరిని కలెక్టర్ రాజాబాబు దగ్గర హాజరుపరిచారు. కలెక్టర్ వీరికి పునరావాస చర్యలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కార్మికుల్లో ఓ దంపతుల 2 నెలల పాపకు JC ” ప్రేరణ” అని నామకరణం చేశారు.

News March 17, 2026

దోర్నాల: పులులు సంచరించే ప్రదేశం.. జాగ్రత్త

image

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా దోర్నాల–శ్రీశైలం రహదారిలో ఈ నెల 20వ వరకు రాత్రి వేళల్లోనూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మార్గం పులుల అభయారణ్యం గుండా వెళ్లడంతో, రాత్రి సమయంలో పులులు సహా, అడవి జంతువులు రోడ్డు దాటే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.