News April 14, 2024

ఉదయాన్నే ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండల శివారులో బైక్‌ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 11, 2024

ఖమ్మం: ఒకే గ్రామం నుంచి 8 మంది టీచర్లుగా సెలెక్ట్

image

వైరా మండలం రెబ్బవరం నుంచి 8 మంది టీచర్లుగా సెలెక్ట్ అయ్యారు. గోపాలరావు, కవిత, రాము, జాలది ఉష, దివ్య, సుజాత, శిరీష, ఖాసీమ్ డీఎస్సీ ఫలితాలలో ఉద్యోగాలు సాధించారు. వారిని రెబ్బవరం స్కూలు పూర్వ విద్యార్థుల సంఘం, గ్రామ పెద్దలు సన్మానించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పాలని వారికి సూచించారు.

News October 11, 2024

రతన్ టాటాతో ఖామ్మానికి అనుబంధం

image

పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా 1983లో ఖమ్మం వచ్చారు. గాంధీచౌక్‌లో వ్యాపారవేత్త కాళ్ల వెంకట రామారావు తెలంగాణ ఏజెన్సీస్‌ను నెలకొల్పగా, నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ డీలర్ షిప్ తీసుకున్నారు. అంతేకాక ఈ కంపెనీ డీలర్ల రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈమేరకు నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ డీలర్షిప్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించగా రతన్ టాటా హాజరయ్యారు.

News October 11, 2024

KMM: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.