News April 14, 2024
పంజాబ్ కింగ్స్ వైస్ కెప్టెన్సీపై గందరగోళం
పంజాబ్ కింగ్స్ వైస్ కెప్టెన్సీపై గందరగోళం నెలకొంది. తొలుత కెప్టెన్ శిఖర్ ధవన్ అందుబాటులో లేకపోవడంతో IPL ట్రోఫీ ఫొటోషూట్కు జితేశ్ శర్మను వైస్ కెప్టెన్గా పంపారు. నిన్న RRతో జరిగిన మ్యాచ్లో శిఖర్ ఆడలేదు. ఆయన స్థానంలో సామ్ కరన్ కెప్టెన్సీ చేపట్టారు. జితేశ్ను పక్కనబెట్టారు. దీనిపై కోచ్ బంగర్ స్పందించారు. ‘మా VC కరనే. ఫొటోషూట్ సమయంలో కరన్ అందుబాటులో లేకపోవడంతో జితేశ్ను పంపాం’ అని స్పష్టం చేశారు.
Similar News
News October 12, 2024
టూత్ బ్రష్లపై బ్యాక్టీరియాలను చంపే వైరస్లు!
షవర్ హెడ్స్, టూత్ బ్రష్లో మునుపెన్నడూ చూడని కొత్త వైరస్లను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 614 వైరస్లను కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆశ్చర్యకర విషయమేంటంటే అవేవీ మానవాళికి హాని కలిగించేవి కాదు. పైపెచ్చు ఇవి హానికర బ్యాక్టీరియాలను చంపుతాయని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సూపర్ బగ్లకు వ్యతిరేకంగా చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ వైరస్లు దోహదపడతాయి.
News October 12, 2024
విమాన ఘటనపై విచారణకు ఆదేశించిన డీజీసీఏ
తిరుచ్చిలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ <<14334728>>ఘటనపై<<>> DGCA విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. 141 మందితో ఉన్న విమానం సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. పైలెట్తో పాటు విమాన సిబ్బందిని అభినందించారు. ప్రయాణికుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
News October 12, 2024
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
AP: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు పర్వానికి చేరాయి. ఆఖరి రోజైన ఇవాళ స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. దీంతో ఉత్సవాలు ముగియనున్నాయి. దీనికోసం ఇప్పటికే టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆఖరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.