News April 14, 2024
రేపు కాంగ్రెస్లోకి మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి..?

నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఈనెల 15న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ను వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ కేటాయించారు. దీంతో కాంగ్రెస్లో చేరేందుకు ఇటీవల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లితో వెళ్లి రేవంత్రెడ్డిని కలిసి చర్చించారు. సీఎం నుంచి క్లారిటీ రావడంతో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లు టాక్. అయితే చేరికపై క్లారిటీ రావాల్సి ఉంది.
Similar News
News September 11, 2025
మెదక్: బోధనా నాణ్యత పెరగాలి: కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి FLN, TLM బోధన అభ్యసన మేళాను కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతను ప్రోత్సహించడం, తరగతి గదుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరచడం కోసమే బోధన అభ్యసన మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేళాలో 21 మండలాల నుంచి 1-5 తరగతుల ఉపాధ్యాయులు పాల్గొనగా ఎనిమిది మంది టీచర్స్ రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికయ్యారు.
News September 10, 2025
కళా నైపుణ్యాలను వెలికితీయడానికే కళా ఉత్సవ్: డీఈవో

విద్యార్థుల్లో దాగి ఉన్న కళానైపుణ్యతను వెలికితీయడానికే ఉద్దేశంతోనే కళా ఉత్సవ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రొఫెసర్ రాధాకిషన్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కళా ఉత్సవ్ ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులలో కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు కళా ఉత్సవ్ పోటీలు ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.
News September 10, 2025
తూప్రాన్: ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్

తూప్రాన్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. మనోహరాబాద్ మండల పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి, రోగులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూపరింటెండెంట్ అమర్ సింగ్కు సూచించారు.