News April 14, 2024
HYD: తిరుపతి వెళ్లేవారే TARGET.. జర జాగ్రత్త..!

తిరుపతి వెళ్లే వారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన ఎల్బీనగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బైరామల్గూడ వాసి కపిల్ రెడ్డిని చరణ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తాను TTD ఛైర్మన్ PA అని, శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేస్తానని నమ్మించి ఈనెల 7న రూ.1,60,900 తీసుకున్నాడు. ఆ తర్వాత కపిల్.. చరణ్కు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News April 3, 2026
HYDలో ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే!

ఐటీ కారిడార్లోని సైబర్ టవర్స్ వద్ద మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఉదయం వేళ కేవలం ఒక గంటలోనే ఏకంగా 10,138 మంది ఒంటరి వాహనదారులు (సింగిల్ రైడర్లు) వెళ్లినట్లు గుర్తించారు. డబుల్ రైడర్లు 3,584 మంది మాత్రమే ఉన్నారని తేలింది. ఈ స్థాయిలో సింగిల్ రైడర్ల సంఖ్య పెరగడం వల్లే రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
News April 3, 2026
HYD: ఇద్దరు IAS అధికారులకు పోస్టింగ్లు

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టులు కేటాయిస్తూ సీఎస్ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వాణి ప్రసాద్ను యువజన అభివృద్ధి, పర్యాటకం, సంస్కృతి శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. జయేష్ రంజన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. క్రీడా శాఖకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
News April 3, 2026
HYD: ఇద్దరు IAS అధికారులకు పోస్టింగ్లు

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టులు కేటాయిస్తూ సీఎస్ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వాణి ప్రసాద్ను యువజన అభివృద్ధి, పర్యాటకం, సంస్కృతి శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. జయేష్ రంజన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. క్రీడా శాఖకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.


