News April 14, 2024

విశాఖ: ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు బ్యానర్లు

image

పరవాడ మండలం మూల స్వయంభువరం గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రామంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ నుంచి వచ్చే దుమ్ము, ధూళి, ఉప్పునీటి తుంపర్లు కారణంగా అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వీటినుంచి తమను రక్షించే వరకు తాము అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Similar News

News October 7, 2025

రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో నారా లోకేష్ భేటీ

image

రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల రాకతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహా నగరంలో లగ్జరీ టౌన్ షిప్ నిర్మాణం చేపట్టాలని మంత్రి లోకేష్ ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బాగస్వామ్యం అవ్వాలని కోరారు.

News October 6, 2025

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు

image

భారత మహిళా క్రికెట్ జట్టు సోమవారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు జట్టుకు స్వాగతం పలికారు. గురువారం దక్షిణ ఆఫ్రికా జట్టుతో భారత జట్టు పీఎం పాలెం స్టేడియం వేదికగా తలపడనుంది. మంగళ, బుధవారాల్లో మహిళా జట్టు స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రీడాభిమానులు కొనుగోలు కోసం ఆసక్తి చూపుతున్నారు.

News October 6, 2025

విశాఖకు టాటా గ్రూప్ చైర్మన్‌ను ఆహ్వానించిన మంత్రి

image

టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబైలో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో ఈ నెలలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధిలో టాటా భాగ‌స్వామ్యం కావాల‌ని, అన్ని రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు.