News April 14, 2024

ఇరాన్‌కు ఘోర పరాభవం

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులతో రెచ్చిపోతోంది. కానీ యూఎస్, యూకే, ఫ్రాన్స్, జోర్డాన్ దళాలు వీటిని అడ్డుకుంటున్నాయి. ఇప్పటివరకు ఇరాన్ దాదాపు 185 డ్రోన్లు, 110 బాలిస్టిక్ మిస్సైల్స్, 36 క్రూయిజ్ మిస్సైల్స్ ప్రయోగించగా.. వాటన్నింటినీ దళాలు కూల్చివేశాయి. మధ్యధరా సముద్రంలోని యుద్ధనౌకలు వీటిని అడ్డుకున్నాయి. దీంతో ఇరాన్‌కు ఘోర పరాభవం తప్పలేదు. కాగా తాజాగా ఇజ్రాయెల్‌కు ఆస్ట్రేలియా మద్దతు తెలిపింది.

Similar News

News March 23, 2026

పీరియడ్స్‌లో దైవ దర్శనం చేసుకోవచ్చా?

image

తీర్థయాత్ర సమయంలో పీరియడ్స్ వస్తే దైవ దర్శనం చేసుకోవచ్చా? అన్న సందేహంపై ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ స్పష్టతనిచ్చారు. ‘నెలసరి అనేది ప్రకృతి సిద్ధమైన ప్రక్రియే కానీ పాపం కాదు. యాత్రలో పీరియడ్స్ వస్తే, స్నానం చేసి శుచిగా ఉండి దూరం నుంచే దేవుడిని దర్శించుకోవచ్చు. పూజా సామగ్రిని తాకడం, ప్రసాదం వండటం వంటివి చేయకూడదు. భగవంతుడికి కావాల్సింది కేవలం నిర్మలమైన భక్తి మాత్రమే’ అని వివరించారు.

News March 23, 2026

TN పోల్స్.. బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, AIADMK మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం బీజేపీకి 27 సీట్లు ఇచ్చేందుకు AIADMK అంగీకరించింది. PMK 18, AMMK 11 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. గత ఎన్నికల కంటే బీజేపీ 7 సీట్లు ఎక్కువ దక్కించుకుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

News March 23, 2026

ఇళ్ల కోసం 10 లక్షల దరఖాస్తులు: పార్థసారథి

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల కోసం 10 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పార్థసారథి తెలిపారు. అందులో 6.5 లక్షల మందికి అర్హత ఉందని గుర్తించామని చెప్పారు. ఇంటి నిర్మాణ వ్యయం పట్టణాల్లో రూ.2.5 లక్షలు, గ్రామాల్లో రూ.2.39 లక్షలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు అకాల వర్షాలకు దాదాపు 15 వేల మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. ఈ నెల 31 లోపు పంట నష్టం వివరాలను అందించాలని ఆదేశించినట్లు వివరించారు.