News April 14, 2024
ప్రతిపక్షాల్లో ఐక్యత లోపించింది: అమర్త్యసేన్
ప్రతిపక్షాలన్నీ ఐకమత్యంగా లేకపోవడం వల్లే బీజేపీని ఎదుర్కోలేకపోతున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. వ్యవస్థాగత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్.. తన ఘనమైన గతం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నిరక్షరాస్యత, లింగ అసమానత్వం భారత అభివృద్ధికి అడ్డంకులుగా మారాయని విమర్శించారు. రాజ్యాంగంలో మార్పుల వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదన్నారు.
Similar News
News October 12, 2024
అధికారిపై పవన్ కళ్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశం
AP: కాకినాడ DFO డి.రవీంద్రనాథ్రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఇటీవల బదిలీపై కాకినాడకు వచ్చిన ఆయన పవన్తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ మైనింగ్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. తన పేరు, పేషీ పేరు వాడటంపై ఆగ్రహించిన పవన్, విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు తన పేరుతో అవినీతికి పాల్పడితే చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
News October 12, 2024
నేటి నుంచి పాపికొండలు టూర్ స్టార్ట్
దసరా సందర్భంగా పర్యాటకులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి పాపికొండల్లో లాంచీల్లో విహరించేందుకు అధికారులు అనుమతిచ్చారు. వరదల కారణంగా ఐదు నెలల పాటు పాపికొండలు టూరిజంను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగవ్వడంతో లాంచీ యజమానుల విజ్ఞప్తుల మేరకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.
News October 12, 2024
నవంబర్ 8 నుంచి DAO సర్టిఫికెట్ వెరిఫికేషన్
TG: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు TGPSC కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో సెలక్ట్ చేశారు.