News April 14, 2024
సీఎం జగన్పై దాడి.. CBI విచారణకు టీడీపీ లేఖ

AP: విజయవాడలో సీఎం జగన్పై జరిగిన రాయి దాడికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్కు టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. ‘సీఎం జగన్పై దాడి దురదృష్టకరం. ఈ ఘటనపై CBI లేదా NIAతో విచారణ జరిపించాలి. సీఎం భద్రత విషయంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా విఫలమయ్యారు. వారిని వెంటనే బదిలీ చేయాలి’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Similar News
News February 19, 2026
AIIMS గోరఖ్పూర్లో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

<
News February 19, 2026
పంటల్లో చెదపురుగులు.. నివారణకు సూచనలు

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.
News February 19, 2026
ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాల వల్ల ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని సూచించింది. భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారని గుర్తుచేసింది. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాలూ ఉచితాలు కొనసాగిస్తున్నాయని తెలిపింది. ఆ సొమ్మును ప్రణాళికాబద్ధంగా వాడాలని సూచించింది. DMK ఉచిత విద్యుత్ ప్రతిపాదనల పిటిషన్ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


