News April 14, 2024
రాళ్లతో కాదు ఓట్లతో దాడి చేయండి
AP: ఎన్నికల వేళ రాజకీయ నాయకులపై ప్రత్యర్థులు రాళ్లు విసరడం కలకలం రేపుతోంది. నిన్న సీఎం జగన్పై రాయితో దాడి జరగడంతో ఆయనకు గాయమైంది. ఇవాళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభల్లోనూ ఆగంతకులు రాళ్లు విసిరారు. రాజకీయాల్లో ఇలాంటి విపరీత చర్యలు శ్రేయస్కరం కాదు. రాళ్లు వేయడం మంచి పద్ధతి కాదు. నాయకులపై వ్యతిరేకతను రాళ్లతో కాకుండా ఓట్ల రూపంలో చూపించండి. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తును మార్చినవారవుతారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News October 12, 2024
అలియా భట్ కుమార్తెకు రామ్ చరణ్ ‘ఏనుగు గిఫ్ట్’!
రామ్ చరణ్కు తనకు మధ్య చక్కటి స్నేహం ఉందని అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన కుమార్తె రాహా పేరు మీద ఓ అడవి ఏనుగును దత్తత తీసుకుని చెర్రీ దాని ఆలనాపాలనా చూస్తున్నారని ఆమె కొనియాడారు. దత్తతకు సూచనగా ఓ ఏనుగు బొమ్మను రాహాకు గిఫ్ట్గా పంపించారని, రాహా రోజూ ఆ ఏనుగుపైకెక్కి ఆడుకుంటుందని వివరించారు. చెర్రీ, అలియా కలిసి RRRలో జోడీగా నటించిన సంగతి తెలిసిందే.
News October 12, 2024
BSNL: రూ.666తో రీఛార్జ్ చేసుకుంటే..
యూజర్ల కోసం BSNL మరో సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.666తో రీఛార్జ్ చేసుకుంటే 105 రోజులు అన్లిమిటెడ్ కాల్స్, నిత్యం 2GB హైస్పీడ్ డేటా, 100 SMSల ప్రయోజనాన్ని పొందొచ్చు. జియో, ఎయిర్టెల్, VIలో ఇటీవల రీఛార్జ్ ధరలు భారీగా పెరగడంతో BSNLకు పోర్ట్ అవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే నెట్వర్క్ సమస్యను పరిష్కరిస్తే మరింతమంది యూజర్లు పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
News October 12, 2024
‘దసరా’ పూజకు సరైన సమయమిదే..
విజయదశమి రోజు సూర్యాస్తమయానికి గంటన్నర ముందుకాలాన్ని విజయ ముహూర్తంగా చెబుతారు. ఆ సమయంలో శమీవృక్షా(జమ్మిచెట్టు)న్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. జమ్మిని ‘అగ్నిగర్భ’ అని కూడా పిలుస్తారు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని అర్థం. దీనికే ‘శివా’ అనే మరో పేరుంది. అంటే సర్వశుభకరమైనదని. ‘మహాభారతం’ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే దాచారు.