News April 14, 2024

రేపు గుడివాడలో జగన్ బహిరంగ సభ

image

AP: విజయవాడలో రాయి దాడి ఘటనతో CM జగన్ మేమంతా సిద్ధం యాత్రకు ఇవాళ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా రేపు జగన్ యాత్ర కేసరపల్లి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, జొన్నపాడు మీదుగా యాత్ర గుడివాడ చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుని రాత్రికి అక్కడే జగన్ బస చేస్తారు.

Similar News

News March 3, 2026

బెంగళూరులో 5 మ్యాచులు ఆడతాం: RCB

image

IPL-2026లో <<16603983>>బెంగళూరులో<<>> 5 మ్యాచులు ఆడనున్నట్లు RCB ప్రకటించింది. మిగిలిన 2 హోమ్ మ్యాచులను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆడతామని వెల్లడించింది. ‘చిన్నస్వామి స్టేడియం మాకు సొంత గ్రౌండ్ కన్నా ఎక్కువ. మా గుర్తింపు ఇక్కడే. అభిమానులు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. హోమ్ గ్రౌండ్‌లో మ్యాచులను వారు చూడాలి. చర్చలు, అనుమతుల ప్రక్రియ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని RCB CEO రాజేశ్ మేనన్ తెలిపారు.

News March 3, 2026

చంద్రగ్రహణం తర్వాత ఏం చేయాలి?

image

ఇవాళ చంద్రగ్రహణం సా.6.47గంటలకు ముగిసింది. గ్రహణం తర్వాత స్నానం చేయాలని పండితులు తెలిపారు. గ్రహణం కంటే ముందు వండిన వంటలు, పచ్చళ్లపై దర్భ పుల్లలు ఉంచాలని చెబుతున్నారు. ఇల్లు, పూజ గదిని గంగాజలంతో శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల గ్రహణ సమయంలో కేతువు ద్వారా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని నమ్మకం. గ్రహణం తర్వాత దానాలు చేస్తే మంచిదని చెబుతున్నారు.

News March 3, 2026

హార్ముజ్ మూసివేత.. సౌదీ కొత్త ప్లాన్!

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో క్రూడాయిల్ సరఫరాకు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఎర్ర సముద్ర తీరంలోని యంబు టెర్మినల్ నుంచి ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం పర్షియన్ గల్ఫ్ ఫీల్డ్స్‌లోని Abqaiq నుంచి పైపుల ద్వారా క్రూడాయిల్‌ను యంబుకు తరలిస్తారు. అక్కడి నుంచి సూయజ్ కెనాల్ మార్గంలో ఓడల ద్వారా యూరప్ వైపు, బాబ్-అల్-మందెబ్ జలసంధి ద్వారా హిందూ మహాసముద్రంవైపు తరలించవచ్చు.