News April 14, 2024

MBNR: అడుగంటిన భూగర్భ జలాలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 17 మండలాల్లో సాగు, తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జూరాల ప్రాజెక్ట్ పక్కనే ఉన్న ధరూర్ మండలంలోనూ ఫిబ్రవరిలో 26.84 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు మార్చిలో 39.19 మీటర్ల లోతులోకి వెళ్లిపోయాయి. ఒక్క నెలలోనే 12.35 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. అన్ని ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గుతుండగా, మదనాపురం మండలంలో మాత్రం భూగర్భ జలాలు కొంతమేరకు పైకి వచ్చాయి.

Similar News

News March 3, 2026

MBNR: జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు: SP

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వర్గాల మధ్య అపోహలు లేదా ఉద్రిక్తతలు కలిగించేలా సోషల్ మీడియా వేదికల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్ షేర్ చేయడం చట్టపరంగా చర్యలకు గురయ్యే అంశాలుగా పరిగణించబడతాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, నిర్ధారించని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. SHARE IT

News March 3, 2026

ప్రభుత్వ హాస్పిటల్స్ పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి: మాజీ మంత్రి

image

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన నేపథ్యంలో జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ, వంద పడకల హాస్పిటల్‌ను, నూతనంగా నిర్మించిన మార్చురీ బిల్డింగును మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఘటనకు అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

News March 3, 2026

జడ్చర్ల: కుక్కలు పీక్కుతిన్న మృతదేహం ఇతడిదే!

image

జడ్చర్ల మండలం నాగసాల చెరువులో పడి మృతి చెందిన భీమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం గది బయట కుక్కలు పీక్కుతిన్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై నూతన ప్రభుత్వాసుపత్రిలోని పోస్టుమార్టం గదిలోనే అన్ని పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.