News April 15, 2024
అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు ఉంటాయి: ఎంపీ లక్ష్మణ్

TG: బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని దేశంలో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలన టీవీ సీరియల్ ఎపిసోడ్లా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ తోడు దొంగలేనని ఆరోపించారు.
Similar News
News February 18, 2026
తన అనారోగ్య సమస్యను వివరించిన మమ్ముట్టి

గతేడాది తాను జ్ఞానేంద్రియాల సమస్య ఎదుర్కొన్నట్లు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వెల్లడించారు. ‘విన్పించడం, వాసన గుర్తించడం లాంటివి చాలాకాలం తెలియలేదు. నడిచేందుకూ ఇబ్బంది పడ్డా. చికిత్సతో పూర్తిగా కోలుకుంటున్నా’ అని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. మనిషికి జ్ఞానేంద్రియాలు గొప్ప వరమని, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కాగా 2025లో షూటింగ్ల నుంచి బ్రేక్ తీసుకోవడంతో క్యాన్సర్ అని రూమర్స్ వచ్చాయి.
News February 18, 2026
అభిని పక్కనబెట్టి సంజూను తీసుకోవాలని డిమాండ్లు

అభిషేక్ శర్మ గత 7 అంతర్జాతీయ టీ20ల్లో 5 సార్లు (ఈ WCలో 3 సార్లు) డకౌట్ కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి మెగా టోర్నీల్లో ఇంత నిర్లక్ష్యంగా ఆడటం ఏంటని టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కీలకమైన సూపర్-8లో అభిని పక్కనబెట్టి సంజూ శాంసన్ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News February 18, 2026
సర్వంAI.. ఈసారి జెమినీ ఫ్లాష్, డీప్సీక్కు పోటీగా

ఇటీవల <<19088829>>అక్యూరసీలో<<>> చాట్జీపీటీ, జెమినీని బీట్ చేసిన సర్వంAI తాజాగా రెండు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) రిలీజ్ చేసింది. 30B, 105B అనే మోడల్స్ బడా ఏఐ మోడల్స్కు దీటుగా పనిచేస్తాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా 105B LLM జెమినీ 2.5 ఫ్లాష్, చైనాకు చెందిన డీప్సీక్ R1 మోడల్స్ కంటే సమర్థంగా పనిచేస్తుందని పేర్కొంది. నిర్వహణ ఖర్చు కూడా వాటితో పోలిస్తే తక్కువేనని తెలిపింది.


