News April 15, 2024
మైనార్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు తేదీ పొడగింపు

రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ , మైనారిటీల సంక్షేమ శాఖ వారు UPSC – CSAT 2025 పరీక్ష కోసం 100 మంది మైనారిటీ అభ్యర్ధుల నుండి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజయేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ ఈ నెల 22 వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. ఆసక్తి కలిగిన మైనారిటీ విధ్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 11, 2026
టెన్త్ ఎగ్జామ్స్.. 19,835 మంది విద్యార్థులు: నల్గొండ DEO

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. DEO బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 489 పాఠశాలలకు చెందిన 19,835 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,143 మంది బాలురు, 9,551 మంది బాలికలు ఉండగా, 137 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.
News March 11, 2026
NLG: మెనూ పాటించాల్సిందే: కలెక్టర్

మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం NLGలోని ఎస్ఎల్బీసీ మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాస్టల్లోని గదులను వంట గదిని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను వంట బాగుందా?.. మెనూ ప్రతిరోజు అమలు చేస్తున్నారా?.. అని అడిగి తెలుసుకున్నారు.
News March 11, 2026
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి: నల్గొండ ఎస్పీ

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులతో బుధవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. జిల్లాలో నేర నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


