News April 15, 2024

ప.గో.: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గురుకులానికి స్థానం

image

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి డాక్టర్.బీఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చోటుదక్కింది. 3600 ప్రాజెక్టులను వీడియోల ద్వారా తల్లిదండ్రులకు వివరించడం, 500 అంబేడ్కర్ చిత్రపటాలు గీయడం వంటి వేర్వేరు విభాగాల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ రాజారావు ఆదివారం ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

Similar News

News March 14, 2026

ప.గో: భార్య గొంతు కోసిన భర్త

image

భార్య గొంతును బ్లేడుతో కోసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం తణుకులో చోటుచేసుకుంది. కరగాని దిల్లేశ్వరి భర్త గోవిందు మధ్య మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఆమె పని చేస్తున్న డ్రై ఫ్రూట్స్ షాపు వద్దకు వచ్చి తనను బండిపై ఇంటికి తీసుకు వెళ్లాలని కోరాడు. ఆమె బండి నడుపుతుండగా వెనక కూర్చున్న గోవిందు తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో పీక కోసి పరారయ్యాడు.

News March 14, 2026

పశ్చిమగోదావరిలో మార్చి 16 నుంచి ఒంటిపూట బళ్లు

image

ఎండల తీవ్రత దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లాలో మార్చి 16 సోమవారం నుంచి ఒంటిపూట బళ్లు నిర్వహించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయని తెలిపారు. ఎండల నుంచి విద్యార్థులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

News March 14, 2026

ప.గో: గ్యాస్ కష్టాలు.. బ్లాక్‌లో సిలిండర్ రూ.1800

image

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ధరల మోతతో పాటు సర్వర్ల మొరాయింపుతో ఇబ్బందులు పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బుకింగ్ కోసం అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సి వస్తోందని, ఓటీపీ వస్తేనే ఏజెన్సీలు సిలిండర్లు ఇస్తున్నాయని వాపోతున్నారు. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ లో రూ.1400 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అధికారులు స్పందించి అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.