News April 15, 2024
వాష్రూమ్లో ఎక్కువసేపు గడుపుతున్నారా?

ప్రస్తుతం బిజీ లైఫ్లో కొందరు వాష్రూమ్కు కూడా ఫోన్ తీసుకెళ్తుంటారు. ఫోన్ చూస్తూ చాలా సమయం అందులోనే గడిపేస్తుంటారు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చుంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి వెన్నునొప్పికి దారితీస్తుంది. తిమ్మిరి సమస్యలు ఎక్కువవుతాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పైల్స్కు దారితీస్తుంది.
Similar News
News March 13, 2026
పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ సినిమా.. రిలీజ్ డేట్ ఇదే

విజయ్ దేవరకొండతో పెళ్లి వేడుకలు ముగియడంతో రష్మిక మళ్లీ కెరీర్పై ఫోకస్ పెట్టారు. తాను నటించిన బాలీవుడ్ చిత్రం ‘కాక్టైల్-2’ జూన్ 19న విడుదల కానున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. రష్మిక పెళ్లి తర్వాత విడుదల కానున్న తొలి మూవీ ఇదే కావడం విశేషం. ఈ నెల 18న థియేటర్లలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్ నటిస్తున్నారు. 2012లో హిట్ అయిన ‘కాక్టైల్’కు ఇది సీక్వెల్.
News March 13, 2026
IPL SPECIAL: 2 నెలలు పండగే!

ఈనెల 28 నుంచి ఐపీఎల్ సందడి మొదలుకానుంది. ఈసారి రికార్డు స్థాయిలో 84 మ్యాచ్లు జరగనుండటంతో అభిమానులకు 2 నెలల పాటు వినోదం గ్యారంటీ. లీగ్ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన సీజన్ కానుంది. అలాగే ఆటను మరింత రంజుగా మార్చే ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ 2027 వరకు కొనసాగుతుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇవి క్రికెట్ అభిమానులకు మరింత ఆసక్తికర మ్యాచ్లను అందించనున్నాయి.
News March 13, 2026
వారిద్దరూ పార్టీని చీల్చారు: దేవ్జీ

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి వెనక పెద్ద కుట్ర ఉందని ఇటీవల లొంగిపోయిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అన్నారు. ఆపరేషన్ కగార్ ప్రారంభం కాగానే నంబాల బాడీగార్డులు లొంగిపోయి ఇన్ఫార్మర్లుగా మారారని ఆరోపించారు. కీలక నేతలైన మల్లోజుల, ఆశన్న శత్రువులకు లొంగిపోయి ఆయుధాలు అప్పగించారని పేర్కొన్నారు. వీరిద్దరూ పార్టీని చీల్చారని ఆరోపించారు. తాము మాత్రం ఆయుధాలను అడవుల్లోనే వదిలేశామని చెప్పారు.


